Vishwakarma Yojana: కేంద్రం కొత్త స్కీమ్.. రూ.2 లక్షల లోన్.. రోజుకు రూ.500లతో శిక్షణ.. రూ.15 వేల ఆర్థిక సాయం! - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

Vishwakarma Yojana: కేంద్రం కొత్త స్కీమ్.. రూ.2 లక్షల లోన్.. రోజుకు రూ.500లతో శిక్షణ.. రూ.15 వేల ఆర్థిక సాయం!

11/17/2023
Vishwakarma Yojana: Center's new scheme..Rs.2 lakh loan..Training with Rs.500 per day..Rs.15 thousand financial aid!
Vishwakarma Yojana: కేంద్రం కొత్త స్కీమ్.. రూ.2 లక్షల లోన్.. రోజుకు రూ.500లతో శిక్షణ.. రూ.15 వేల ఆర్థిక సాయం!

Vishwakarma Yojana: దేశంలోని చేతి వృత్తుల వారికి కేంద్రంలోని మోదీ సర్కార్ అదిరే గుడ్‌న్యూస్ చెప్పింది. సులభంగా రూ.2 లక్షల లోన్ అందించే కొత్త పథకానికి కేంద్రం కేబినేట్ ఆమోద ముద్ర వేసింది. ఈ లోన్ పై వడ్డీ కూడా కేవలం 5 శాతం మాత్రమే ఉండనుంది. స్కీమ్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Vishwakarma Yojana: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి విశ్వకర్మ పథకానికి సంబంధించి కీలక ప్రకటన చేసింది. చేతి వృత్తుల వారిని ఆదుకునేందు కోసం తీసుకొచ్చిన ఈ పథకం కోసం రూ. 13 వేల కోట్లు కేటాయించినట్లు తెలిపింది. సాంప్రదాయ హస్త కళా నైపుణ్యాల పెంపునకు ప్రభుత్వం ఆర్థిక మద్దతు అందించనుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తాజాగా కేబినెట్ భేటీ నిర్ణయాలను వెల్లడించారు. విశ్వకర్మ యోజన స్కీమ్ కింద దాదాపు 30 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.


హస్త కళాకారులు ఈ కొత్త పథకం కింద సబ్సిడీ వడ్డీ రేటుతో తొలిసారి రూ. 1 లక్ష లోన్ తీసుకోవచ్చు. ఆ తర్వాత రెండో విడతలో రూ. 2 లక్షల వరకు రుణం అందించనుంది కేంద్ర ప్రభుత్వం. ఇందులో లోన్ తీసుకున్న వారికి వడ్డీ రేటు కేవలం 5 శాతంగానే ఉంటుంది. అంటే ఇది చాలా తక్కువ వడ్డీ రేటు అని చెప్పవచ్చు. విశ్వ కర్మ జయంతి సందర్భంగా ఈ పథకాన్ని అమలు చేస్తామని 77వ స్వాతంత్య్ర దినోత్సవం ప్రసంగంలో ప్రకటించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఆ తర్వాత బుధవారం జరిగిన కేబినెట్ భేటీలోనే ఆమోదం తెలిపారు. నేత కారులు, స్వర్ణ కారులు, కమ్మరి, తాళాలు చేసే వారు, కుమ్మరులు, శిల్పులు, చెప్పులు కుట్టే వారు, తాపీ పని చేసే వారు, లాండ్రీ కార్మికులు, క్షురకులు వంటి వారు ఈ స్కీమ్ కింద ప్రయోజనం పొందవచ్చు. వీరి కుటుంబాలకు సులభంగా రుణాలు లభించనున్నాయి. 2028 వరకు ఐదేళ్ల కాలంలో రూ. 13 వేల కోట్ల ఆర్థిక వ్యయంతో కూడిన ఈ పథకం తొలి ఏడాది 18 సంప్రదాయ చేతి వృత్తుల వారికి అందించనున్నారు.

రోజుకు రూ.500 ఉపకారవేతనం.. రూ.15 వేల ఆర్థిక సాయం
మరోవైపు.. చేతి వృత్తులు నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం ఈ పథకం కింద రెండు శిక్షణా కార్యక్రమాలను తీసుకురానున్నట్లు వెల్లడించారు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్. ఈ శిక్షణా కార్యక్రమానికి దరఖాస్తు చేసుకున్న వారికి రోజుకు రూ. 500 ఉపకార వేతనంతో మెరుగైన శిక్షణ ఇవ్వన్నుట్లు తెలిపారు. శిక్షణ తర్వాత పరికరాల కొనుగోలు కోసం రూ. 15 వేల ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు.


కేంద్ర సర్కార్ మరో పథకం కూడా తీసుకువచ్చింది. పీఎం ఇ-బస్ సేవా పథకానికి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ స్కీమ్ కోసం రూ. 57,613 కోట్లు కేటాయించింది కేంద్రం. దేశ వ్యాప్తంగా 10 వేల లక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురావడమే ఈ పథకం లక్ష్యం. 169 పట్టణాల్లో ఈ ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. 3 లక్షలు లేదా ఆపైన జనాభా కలిగిన పట్టణాల్లో ఎలక్ట్రిక్ బస్సులు నడపనున్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ ద్వారా ఈ బస్సులను నడుపనున్నారు. ఈ స్కీమ్ కింద బస్ సేవలకు రూ.10 వేల వరకు ప్రోత్సాహం లభిస్తుంది.

మరోవైపు.. డిజి లాకర్ సర్వీసులను మైక్రో స్మాల్ మీడియాం ఎంటర్‌ప్రైజెస్‌కు విస్తరించింది కేంద్రం. అలాగే తాజాగా ఇండియన్ రైల్వేస్‌కు చెందిన 7 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందు కోసం రూ. 32,500 కోట్లు కేటాయించనుంది. అలాగే ప్రస్తుతం ఉన్న 18 సూపర్ కంప్యూటర్లకు అదనంగా మరో 9 కంప్యూటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
close